Friday 1 May 2015

మార్గశిర మాస ప్రాశస్త్యం:

ఈమాసం లో వచ్చే మొదటి షష్టిని సుబ్రహ్మణ్య షష్టి గా జరుపుకుంటారు. భారత దేశం అంతటా ఈ పండుగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. మార్గశిర పౌర్ణమి దత్తత్రేయ జయంతి. ఈ జయంతి, మృగశిర నక్షత్రం తో కాని, బుధవారం తో కానీ కలిసి వస్తే గొప్ప యోగం. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ దత్తాత్రేయుల వారిది గురు సంప్రదాయంలో ప్రత్యేక స్థానం. దత్త నామమే మహిమాన్వితం. దత్తాత్రేయ ఆరాధనకు ఈ రోజు చాలా మంచిది. అత్రి అనసూయలకు కుమారునిగా త్రిమూర్తుల తేజం "దత్త" నామంతో అవతరించింది. భాగవతం ప్రకారం తనను తాను పుత్రరూపంగా ఇచ్చుకొని అలా ఇవ్వబడిన కారణంగా "దత్త" నామధేయుడు అయ్యాడు. అత్రి కుమారుడు కనుక "ఆత్రేయుడు" అయ్యాడు. ఈ రెండు నామాలు కలిసి దత్తత్రేయుడు. ఇది గురు స్వరూపం. జ్ఞాన స్వరూపం. ప్రధానంగా నారాయణుదై, తదుపరి బ్రహ్మరుద్రాత్మకుడై, త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడయ్యాడు. కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. అందుకే స్వామికి "స్మర్తృగామి" అని పేరు. దత్తజయంతి రోజున దత్తారాధన, స్మరణ ఆవశ్యక ధర్మాలు.

ధనుస్సంక్రాంతి:

ఈరోజు సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే పుణ్యవేళ. ఈ సంక్రమణ కాలంలో విష్ణుపూజ, దానజపాదులు విశేష ఫలప్రదం. ఈరొజు నుండే ధనుర్మాసం ప్రారంభం. ఈరోజు నుండి వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో "తిరుప్పావై" పారాయణ ఆరంభిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం. 

No comments:

Post a Comment