Friday 1 May 2015

ద్వాదశి నాడు విడిచిపెట్టాల్సినవి.
పగటి నిద్ర, ఇతరుల ఇంట భోజనం, రెండోసారి భోజనం, మైథునం, తేనె, ఇత్తడిపాత్ర లేక కంచు పాత్రలలో భోజనం, తైలము అనేవి ద్వాదశి రోజున విసర్జించాలి. ఇవి ఉపవాస ఫలితాన్ని నశింపచేస్తాయి.

ఉగాది నాడు బ్రహ్మదేవుని ప్రార్ధించాలి. ఆయనను ప్రార్ధించే ఏకైక పండుగ ఇదే!
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే!
నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే!
నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే!
                                               
శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ !
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం!

అంటే సర్వారిష్టాలు, (గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైనవి) నివారించబడి, సర్వసంపదలు కలిగి దీర్ఘాయువు, వజ్రము వంటి దేహము (రోగాలు లేకుండా అరోగ్యవంతమైన దృఢమైన దేహము ) లభిస్తాయని చెప్పబడింది.

ఉగాది పచ్చడి ఆరోగ్య రీత్యా చక్కటి ఫలితాలను ఇవ్వడమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచులతో మిళితం కావడం వలన ( వేప రుచికి బుధుడు, బెల్లం గురునకు, మామిడి ముక్కల రుచి శుకృనకు, నెయ్యి చంద్రునకు) గ్రహ దోషాలను నివారిస్తుందని చెబుతారు.

ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయడం, దేవతారాధన, ఉగాదిపచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం తో పాటు మనకు వీలయితే చేయవలసిన మహత్కార్యం ఇంకొకటి ఉంది. అదే ప్రపాదానం. అనగా చలివేంద్రం స్థాపించడం.


 శ్రీరామభక్తుడైన హనుమంతుడు, చైత్ర పౌర్ణమి నాడు జన్మించినట్లు పలుచోట్ల చెప్పబడింది. ఉత్తర భారతం లోనూ, దక్షిణ భారతం లోని కొన్ని ప్రాంతాలలోనూ  ఈనాడే హనుమజ్జయంతి ని జరుపుకుంటారు. కొంతమంది మాత్రం పరాశర సంహిత లో చెప్పబడినట్లు వైశఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతి ని పాటిస్తారు. ఈరోజు హనుమంతుని పూజించడం వలన గ్రహదోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత పిశాచాల వంటి పీడలు తొలగి, గాలిచేష్టలవంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపొయి, ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పబడింది. హనుమజ్జయంతి రోజున సుందరాకాండ, హనుమాన్ చాలీసా లను పారాయణం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. పారాయణను గ్రుహములో చేసినా, దేవాలయములో చేసినా,మంచి ఫలితాలను పొందుతారు. ఇక కదళీ వనము నందు పారాయణ చేసినట్లయితే ఫలము, వేయి రెట్లుగా ఉంటుంది అని పెద్దలు చెపుతారు.

No comments:

Post a Comment