Friday 1 May 2015

కార్తీక మాస ప్రాశస్త్యం (నాలుగవ భాగం)

ఉత్థానైకాదశి:

విష్ణుమూర్తి పాలకడలిలో  ఆషాఢ శుక్ల ఏకాదశినాడు యోగనిద్రలో శయనించిన విష్ణుమూర్తి కన్నులు విప్పి యోగనిద్రను చాలించి లేచిన రోజె " ఉత్థాన ఏకాదశి. ఉత్థానం అంతే లేచుట, మేల్కొనుట అని అర్ధం. యోగ సాధన చేయువారికి ఆకాశములోని నక్ష్త్ర మందలము నుండి భగవద్భక్తి తరంగాలుగా క్రిందకు దిగి శరీరములో ప్రవేశించి ఆత్మను మేల్కొలుపు కాలమిది..

మరునాడు వచ్చె ద్వాదశిని బోధన ద్వాదశి, హరిద్వాదశి , చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈరోజున ఉసిరి చెట్టుకు, తులసి మొక్కకు శ్రధ్ధాభక్తులతో పూజలుచేసి, చలిమిడి దీపాలు వెలిగించి, అవి కొండెక్కిన తర్వాత చలిమిడిని ప్రసాదంగ తీసుకుంటారు. ఈరోజున చేసే దీపదానం, వస్త్ర దానం విశేష ఫలితాలను ఇస్తాయి. ద్వాదశినాటి సాయంత్రం లక్స్మీదేవికల్యాణం చేస్తారు. పాల సముద్రము చిలికిన సమయములో లక్ష్మి ఉద్భవించినపుడు ఆమెకు విష్ణువుతో వివాహం జరిగిన రోజు ఇదే అని అంటారు. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు క్రింద శుచిగా వండిన వివిధ వంటల్ని కేశవారాధనతో నివేదించి బంధుమిత్ర సహితంగా ఆరగించడం అనేది "కార్తీక వన సమారాధన" గా నేటికీ ఆచరణలో ఉంది.

కార్తీక పూర్ణిమ:

చంద్రుడు మనసుకు ప్రశాంతతను ఇస్తాడు. తమోగుణాన్ని హరిస్తాడు. అతడిని శివుడు తన జటాజూటంలో ధరించాడు. అందుకే అతని పేరుతో ఏర్పడిన సోమవారం నెలలో విశిష్టమైనది. పూర్ణిమ నాటి వెన్నెల ఆరోగ్యకరం కనుక కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం వండుకుని పూజాదికాలు నిర్వహంచి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పూర్ణిమ నాడు తెల్లవారి నాలుగయిదు గంటల మధ్య కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. సమయంలో నదీస్నానం పుణ్యప్రదం అని, ఆరోగ్యదాయకం అని పెద్దలు చెబుతారు.

కార్తీక పూర్ణిమ శ్రేష్టమైనది. ఈరోజున ఉపవాసం, దానం, అర్చన, స్నానం విశేష ఫలదాయకం. పూర్ణిమ నాడు విశేషంగా దీపారాధన చేయడం మంచిది.

నరకచతుర్దశి..

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు తెల్లవారుజమునే నరక భయ నివారనార్ధం నువ్వుల నూనె తొ అభ్యంగన స్నానము చేయవలెను. దీపావళి పర్వదినాల్లో లక్ష్మీదేవి తిలతైలంలో (నువ్వులనూనె) ఉంటుందిట. కాబట్టి తిలతైలంతో తలస్నానం లక్ష్మీప్రదం అని చెప్తారు. చతుర్దశినాదు నీటిలో గంగాదేవి సమాహితమై ఉంటుంది. ఒకరోజు ముందుగానే నీటిని పట్టి పాత్రలలో నిలువ ఉంచి నీటితో స్నానం చేయాలి. పాత్రలలో ఉత్తరేణి, తుమ్మ, తగిరస చెట్ల కొమ్మలను నానబెత్తడం వలన వాటిలోని అఔషధ గుణాలు నీటిలోకి వచ్చి చేరుతాయి.

నరక చతుర్దశినాటి వంటకాల విషయములో కూడా కొన్నినియమాలు ఉన్నాయి. నువ్వులు, మినుములు,బెల్లం తో చేసిన పదార్ధాలు తప్పక తినాలి అని శాస్త్రం. ఇవన్నీ ఋతువులు మారిన కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి పెట్టిన నియమాలు. నరక చతుర్దశి నాడు సంధ్య వేల కాగడాలు చేత పట్టుకొని పితరులకు దారి చూపాలట. దాని నిమిత్తం ఇంటి వెలుపల ద్వారం వద్ద దీపాలు వెలిగించాలి.

 ధనత్రయోదశి:

త్రయోదశి నాటి సాయంకాలము ఇంటి వెలుపల యముని ప్రీత్యర్ధం దీపములు వెలిగించాలి. దీనివలన అపమృత్యువు నశిస్తుంది అని స్కంద పురాణమున చెప్పబడింది. రోజున పితృదేవతలు సూక్ష్మ రూపాలలో ఇళ్ళకు వస్తారు అని, దీపములు వెలిగించి వారిని సత్కరించాలి అని నమ్ముతారు. ఈరోజున కొంతమంది లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు బంగారం ఆభరణములు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


No comments:

Post a Comment