Tuesday 4 February 2014

24, ఏప్రిల్ 1973 న ముంబై లో జన్మించిన  ప్రముఖ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్ గురించి ప్రపంచం మొత్తం మిద ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు. క్రికెట్ ఒక మతం అయితే, సచిన్ క్రికెట్ దేవుడు అని పలువురు ప్రశంసించారు అంటే అతని గురించి వేరే మాటలు చెప్పే అవసరం ఏముంది?

క్రికెట్ ఆట లో సమీప భవిష్యతు లో ఎవరు బద్దలు కొట్టలేనంతగా ప్రతి అంశం లోను రికార్డ్స్ నెలకొల్పి 16, నవంబర్ 2013 న ముంబై వాంఖడే స్టేడియం లో జరిగిన 200 వ టెస్ట్ మ్యాచ్ లో రిటైర్ అయిన సచిన్ ఇంతకు ముందే అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి ఎన్నో అవార్డు లు అందుకున్నాడు.

ఒక ఆటగాడిగా అతనిని ఎంతమంది అభిమానిస్తారో, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తిగా కుడా అతనిని ఆరాధిస్తారు. అతని వ్యక్తిత్వం అందరు అనుసరించ తగ్గది.

అతని చివరి టెస్ట్ మ్యాచ్ పూర్తీ అయి, తానూ రిటైర్ అవుతున్నాను అని ప్రకటించిన కొన్ని గంటల లోపే భారత ప్రభుత్వం సచిన్ కు అత్త్యుత్తమ పౌర సత్కారం అయిన " BHARATA RATNA" ప్రకటించి గౌరవించింది. ఈ విషయమై తరువాత ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.

ఈ రోజు ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ సి. ఎన్. అర్ . రావు గారితో పాటు సచిన్ టెండూల్కర్ కు కూడా భారత్ రత్న అవార్డు ప్రదానం చేసి భారత దేశం తనను తాను గౌరవించుకుంటున్నది.

ఇది యావద్భారత దేశానికే లభించిన గొప్ప సత్కారం.


No comments:

Post a Comment