Sunday 2 February 2014

  శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర ప్రశస్తి:

భారతీయ సంస్కృతికి మూలమైన మహా గ్రంధాలు రామాయణం, భారతం, భాగవతం. శ్రీ మద్భగవతానికి రెండిటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క సూక్తి. మొదటిది కృష్ణ భగవానుడు అర్జునునికి అనుగ్రహించిన శ్రీ మద్భగవద్గీత , రెండవది భీష్ముడు లోకానికి ప్రసాదించిన శ్రీ విష్ణు సహస్ర నామం.

రెంటిలో మొదటి దానిని శ్రీ కృష్ణుడు అర్జునునకి ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించారు. రెండవది భారత సంగామం అనంతరం అంపశయ్యపై పది ఉన్న భీష్మ పితామహుని ద్వారా శ్రీ కృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయించాడు.

 ఈ రెండిటిలో భగవద్గీత కంటే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చని శ్రీ కృష్ణుని అభిమతం. కృష్ణుడు భారత సంగ్రామ అనంతరం పాండవులందరినీ తీసుకోని అంపశయ్యపై నున్న భీష్ముని దగ్గరకు వస్తాడు. ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయములను తీర్చమని కృష్ణుడు భీష్ముని కోరుతాడు. తనకు అవేవి జ్ఞాపకం లేవు, చెప్పే శక్తి లేదు అంటాడు భీష్ముడు. అతనికి తెలిసినవన్ని జ్ఞాపకం వచ్చేటట్లు, పూర్వపు శక్తి కలుగునట్లు, దేహబాధ తెలియకుండా వరాలిస్తాడు కృష్ణుడు. భీష్ముడు ఆశ్చర్యముతో " అన్ని వరాలు నాకు ఇచ్చి, నాచేత చెప్పించడం ఎందుకు? నివే చెప్పవచ్చు కదా కృష్ణా" అని ప్రశ్నిస్తాడు. " లోకంలో ఎక్కడైనా తనను గూర్చి తనే చెప్పుకోకూడదు.ఎదుటివారు గుర్తించి పొగిడితే, లోకం కూడా ఆ గొప్పతనాన్ని గుర్తిస్తుంది.ఒక తత్వాన్ని గురించి తత్త్వ దర్శనం చేసినవారు చెప్పాలి కనీ, తత్త్వము తనను గూర్చి చెప్పుకొరదు కదా, భీష్మ పితామహా! నివు తత్త్వ దర్శనం చేసిన ఆచార్యుడవు. ని నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికీ హితమును ఉపదెశించుము. అని అంటాడు కృష్ణుడు.

దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండా ఉన్నా ఇవ్వడానికి వీలులేదు. ఇచ్చినా త్రాగడానికి పనికిరావు. ఆ నీటినే మేఘము గ్రహించి వర్షంగా కురిపిస్తెనె త్రాగడానికి వీలవుతుంది. కృష్ణుడు సముద్రము వంటి వాడు. అతని గుణ ప్రవాహాన్ని భీష్ముడు మేఘంలాగా గ్రహించాడు. కనుక కృష్ణుడు అతఃనిని ప్రోత్సహించాడు. అంతే కాక,"లోకం లో నన్ను జ్ఞానిగా గుర్తించడం గొప్ప కనే కాదు, భీష్ముడిని జ్ఞానీ గా , తత్త్వ దర్శిగా గుర్తించడం అవసరం, అని భీష్ముని ప్రేరేపిస్తాడు.

జన్మమెత్తిన ఏ జివి అయినా ఈ సంసార చక్రము నుండి బయట పడాలంటే తెలియ వలసిన తత్త్వమెది? ఈ జీవులు ఎక్కడకు చేరుతారు, ఆ చేరడానికి ఏమి చేయాలి? ఎవరిని స్తుతిస్తె, అర్చిస్తే మానవులు కోరిన సుఖాలు అన్నీ పొందుతారు అని, భవత: పరమో మత: " నీవు ఏది భావిస్తున్నవొ దానిని అనుగ్రహించు అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. సర్వ జగత్కారణమైన శ్రీమన్నారాయణుని "స్తువన్" స్తోత్రము చేయుచు "త్వమేవ చ అర్చయన్" అతనినే ప్రేమతో పూజిస్తే "సర్వ దు:ఖాతిగో భవేత్" అన్ని దు:ఖములని దాటి పోవచ్చు. ఆ పున్దరికాక్షుని అర్చించదమె "ఏషమే అధిక తమో మత:" అన్ని ధర్మాలలొకి శ్రేష్టమైన ధర్మమూ అని నా అభిప్రాయం. అతని నామములను కీర్తిస్తే సకల పాపాలు పోతాయి. పవిత్రులౌథారు. ఏ కోరిక కోరినా, అవన్నీ లభిస్తాయి. దీనిని మించిన గొప్ప మంత్రము మరొకటి లేదు, వేయి నామాలు కల మూలా మంత్రము ఈ స్తోత్రము. "

ఈ వేయి మంత్రాలూ ఎక్కడివో తెలుసా? నేను కల్పించలేదు, " యని గౌణాని విఖ్యాతాని ఋషిభి: పరి గీతాని" ఋషులచే గానము చేయబడినవి. శ్రీమన్నారాయణుని గుణములను అనుభవించిన ఋషులు ఆ అనుభవముతో ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడా గల ఆ ఋషుల వాక్ అమృతం కలిసి పరీవాహమై లోకములో మనం కుడా పాడగలిగేటట్లు శ్రీ వ్యాస భగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను . నివు అడిగావు కనుక సర్వ జీవులు ఉద్ధరించ బడడానికి చెప్పుచున్నాను అని భీష్ముడు ఉపదేశిస్తాడు.

అట్టి మహాభారత సారము, పరమ ఋషులచే దర్శితము, శ్రీ భీష్మ పితామహుని అభిమతము, శ్రీ వేద వ్యాస్సుని ఉపదేశము, భగవద్గిత కంటే శ్రేష్టము అయినది శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము. ఎందఱో ఆధునికులు కూడా దీనిని సకల అభిష్ట సిధ్ధిదము అని పొగిడినది అయిన ఈ స్తోత్రాన్ని మనం నిత్యమూ పఠించి కోరినవన్నీ పొందుదాము.

ఓం నమో భగవతే వాసుదేవాయ....


No comments:

Post a Comment