Monday 24 February 2014

ఈ రోజు ఈ గుడి చరిత్ర తెలుసుకుందాం....

ఈ గుడిలో అమ్మవారి విగ్రహం.. నడుము పైభాగం మాత్రమే ఉంటుంది. అమ్మవారి ఎడమచేయి సగం తెగిపోయి ఉంటుంది. దిని వెనుక ఒక కథ ఉన్నది. పూర్వం ఒక బ్రాహ్మణుడు కాశీకి కాలినడకన బయల్దేరాడు. బురుజుపేట వరకు వచేసరికి మధ్య్యహ్నంకావడంతో సమీపంలోని బావి వద్దకు వెళ్లి స్నానం చేసి సూర్యనమస్కార చేసుకుందామని అనుకున్నాడు. అక్కడి బావిలోనుంచి "నేను బావిలో ఉన్నాను. నా విగ్రహాన్ని బయటకి తెసి ప్రతిష్టించు" అని లక్ష్మి దేవి అతనితో చెప్పిందట." నేను శివుడిని తప్ప ఎవరిని పూజించను" అన్నాడట. అంతేకాక, నేను కాశీకి వెళ్ళే తొందరలో ఉన్నాను, విగ్రహం తీసేంత సమయం నాకు లేదు అని అన్నాడట. అమ్మవారికి కోపం వచ్చి తన ఎదమచేతిలోని ఆయుధంతో బ్రాహ్మణుడిని శిక్షించాలి అనుకున్నదట. అపుడు అతని ఇష్టదైవమైన శివుడు ఆమె ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఆమె ఎడమచేతిని ఖండించాడుట. తరువాత ఆమెతో "నువ్వు ఈ ప్రాంతంలోనే కనక మహాలక్ష్మిగా పూజలు అందుకుంటావు " అని చెప్పాడుట.

ఈ ప్రాంతాన్ని విశాఖ రాజులూ పరిపాలించే కాలంలో అమ్మవారి విగ్రహం ఒక పక్క పడి ఉన్నదిట. ఆ రాజులు వీధిని వెడల్పు చేయాలనే ఉద్దేశ్యంతో విగ్రహాన్ని వేరేచోటకు జరిపారు. అప్పటినుంచి స్థానికులకు రకరకాల అనారోగ్య సమస్యలు , ముఖ్యంగా ప్లేగు వ్యాధి ప్రబలిందట. దాంతో భయపడిన ప్రజలు విగ్రహాన్ని యధాస్థానంలో పెట్టేసారు. వెంటనే సమస్యలు అన్ని సమసిపోయయిట.

అక్కడ ఆలయ నిర్మాణం జరిగితే ఎప్పటిలా సామాన్యులు స్వయంగా పూజలు జరుపుకోలేరు అని భావించి ఆ ప్రయత్నం మానుకున్నారు. అందుకే ఈ గుడిలో గర్భగుడి ఉండదు. ప్రత్యెక పూజల సమయంలో తప్ప ఇక్కడ పూజారులు ఉండరు. భక్తులు స్వయంగా పసుపు కుంకుమలతో అర్చించుకొవచ్చు.1997లొ కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనలతో ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.

మార్గశిర లక్ష్మివారాల్లో ఇక్కడ విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. పుష్యమాసం మొదట్లో అమ్మవారి రథయాత్ర జరుగుతుంది.

No comments:

Post a Comment