Monday 24 February 2014

భారతదేశం, వేదాలు, ఉపనిషత్తులను కన్న కర్మ భూమి. హిందూ ధర్మం ఎంత విశాలమైనదో, ఈ భూమి మిద ప్రకృతికి, బ్రాహ్మణులకు, దేవతలకు ఎంతటి ఉత్తమ స్థానం కల్పించారో, మన పూర్వులు ఎంతటి విశాల హృదయంతో అందరి మేలు కొరకు వేడుకోన్నారో మనకు వేదాలు, ఉపనిషత్తులు చదవడం ద్వార తెలుస్తుంది. ఉపనిషత్తుల లోని శాంతి మంత్రములు ఈ కోవకి చెందినవే....

1. ఓం సహనావవతు, సహనౌభునక్తు,
సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు, మావిద్విశావహై:

2. ఓం సర్వ్వేశాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శన్తిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి: శాంతి: శాంతి:

3. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశం
గో బ్రహ్మనేభ్య: శుభమస్తు నిత్యం లోకా: సమస్తా సుఖినోభవంతు.

4. ఓం సర్వే భవంతు సుఖిన: సర్వేస్సంతు నిరామయా:
సర్వే భద్రాణి పస్త్యంతు , మాకశ్చిదుఃఖ: మాప్నుయాత్.

5. ఓం సర్వస్తరతు దుర్గాణి, సర్వో భద్రాణి పస్యతు
సర్వ సద్భుద్ది మాప్నోతు, సర్వ స్సర్వాత్ర సందతు.

6 .ఓం దుర్జన స్సజ్జనో భూయాత్, సజ్జన శాంతి మాప్నుయాత్
శాంతో ముచ్యేత బందేభ్యో, ముక్తస్చాన్యా న్విమోచానాత్.

7. కాలేవర్షతు పర్జన్య: పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా స్సంతు నిర్భయ:

8. ఓం శంనో మిత్ర: శం వరుణ: శంనో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి: శంనో విష్ణు రురుక్రమ:

గురుశిష్యులు పరస్పరం విద్య ఆరంభించేటప్పుడు చదివే మంత్రం " దేవుడు మమ్ముల రక్షించు గాక. మమ్ములను పోషించు గాక. అన్ని గ్రంథములను, శాస్త్రములను చదివి బాగుగా అర్ధం చేసుకునే శక్తి మాకు ఇచ్చు గాక. మమ్ములను విద్యలో ప్రావీణ్యుల చేయు గాక. మా మధ్య ద్వేషము, కలహములు రాకుండు గాక. "

అన్ని వేళలా సర్వత్రా సుఖమయమగు గాక. సర్వత్ర శాంతి నెలకొను గాక. సర్వత్ర విజయము చేకూరు గాక. సర్వత్రా మంగళమగు గాక.

ప్రజలందరూ న్యాయ మార్గమున నడిచి, పాలకుల న్యాయమైన పరిపాలనలో సుఖముగా నుందురు గాక. ప్రతి నిత్యం, గోవులకు, బ్రాహ్మణులకు శుభమగు గాక. లోకములన్నియు సుఖమును పొందు గాక.

లోకములో ప్రజలందరూ, ఆయురారోగ్యములతో కూడి, పాలకుల రక్షణలో సంతోషముగా, ఏ దు:ఖము లేకుండా ఉందురు గాక.

ఈ పుడమిని మేఘములు సరిఐన సమయములో కురియు గాక. భూమి సస్యస్యామలమగు గాక. దేశములో ఏ సంక్షోభములు లేకుండు గాక. బ్రాహ్మణులకు సరిఐన గౌరవం లభించు గాక.

జీవకోటికి ఆధారమైన సూర్యుడు, పంటలకు కారణమైన వరుణుడు, ధర్మాధికారి ఐన యముడు, వీరందరికీ ఆధారభూతమైన ఇంద్రుడు, బుద్ధిని పెంపొందించే బృహస్పతి, జీవుల పోషణకు ఆధారమైన విష్ణువు, మనకు అనుకూలముగా ఉండి, మన జీవితాలను సుసంపన్నం చేయుదురు గాక.

చూసారా. ఎంత అర్ధం ఉన్నదో, ఈ శాంతి మంత్రాలను, ఇంట్లో కానీ, లేదా ఏదైనా దేవాలయములో, వేరే ఇతర ప్రదేశాల్లో, ఏదైనా పూజలు, హోమాలు చేసినపుడు సర్వత్రా శుభం కోరి చదువుతారు. నేను, నా వాళ్ళు అనే సంకుచితత్వం లేకుండా మన పూర్వులు, అందరు బాగుండాలి అని కోరుకునేవారు. ప్రకృతికి, గోవులకు బ్రాహ్మణులకు సమాజంలో ఒక సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు.

ఈ శాంతి మంత్రములు మనం కూడా చదివి ఆచరిద్దాం.

No comments:

Post a Comment