Monday 24 February 2014

కలియుగంలో వెలసిన షిర్డీ సాయినాథుని గురించి అందరికి తెలుసు. అయన బోధలు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండేవి. ఆత్మ, పరమాత్మా, బ్రహ్మజ్ఞానం అంటూ కఠినమైన విషయాలు కాకుండా, మానవుడు క్రమశిక్షణతో మెలగడానికి కావలసిన సూత్రాలు చెప్పారు. అయన తన జీవితంలో వివిధ సందర్భాలలో ప్రవచించిన సూక్తులను అయన సన్నిహితులు, భక్తులు సేకరించి మనకు అందించారు. అందుకే ఆయన చరిత్ర చదివి, ఆచరిస్తున్న భక్తులకు క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఒక నిరాడంబరమైన జీవితం అలవాటు ఔతున్ది.. అయన బోధలలో కొన్ని ఈరోజు చూద్దాం.

ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. పొందిన సేవకు తగిన ప్రతిఫలం చెల్లించు.
పరుషమైన మాటలు మాట్లాడడం, ఒకరి మనసును గాయపరచడం తగదు.
ఎవరైనా ని సహాయం కోరి వచ్చినపుడు నీవల్ల జరిగితే సహాయం చేయి లేదా సహాయం చేసే వ్యక్తిని చూపించు.
ఎవరైనా నిన్ను ఏదైనా అడిగినపుడు ఉంటె ఇవ్వు. లేకుంటే లేదు అని చెప్పు. అంతేకాని దూషణ చేయకు.
పరుల గురించి చెడుగా మాట్లాడేవారిని నేను స్వీకరించను.
అందరిని ప్రేమించు. ఎవరితోనూ పోట్లడకు. ఇతరుల మంచి చెడులు చర్చిస్తూ కాలాన్ని వృధా చేయకు.
చెడు చేసిన వారికీ కూడా మంచి చేసే మనసు నీకు ఉన్నప్పుడు ఇతరుల నిందలు నిన్ను బాధించవు.
నింద, ప్రతినింద, ద్వేషం, కోపం వంటివి పతన కారణాలు.
ఎన్ని గ్రంథాలు చదివినా, గురుబోధతో సమానం కాదు.
ధర్మబద్ధమైన జీవితం గడిపెవాడికి జీవితంలో ఏఆటంకాలు రావు.
సదా నన్ను స్మరించేవారికి, నా చరిత్ర గానం చేసేవారికి నేను బద్దుడను.

మరికొన్ని తరువాత తెలుసుకుందాం.

No comments:

Post a Comment