Monday 24 February 2014

సప్తపది--మంత్రాలూ-- వాటి వివరణ...

భారతీయ వివాహ సంప్రదాయంలో వరుడు, వధువు కలిసి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, అప్పుడు మంత్రాలూ చెపుతారు కదా.... వాటికీ వివరణ ఇది....

1. వరుడు:

ఓ కన్యా! నీవు నా వెంట నడువుము. నివు వేసే మొదటి అడుగువల్ల విష్ణుమూర్తి అన్నాన్ని, రెండవ అడుగు వల్ల బలాన్ని, మూడవ అడుగు వల్ల మంచి కార్యాలను, నాల్గవ అడుగు వల్ల సౌఖ్యాన్ని, అయిదవ అడుగు వల్ల పశు సమృద్ధిని, అరవ అడుగు వల్ల రుతు సంపదలను, ఏడవ అడుగు వల్ల ఏడుగురు హోతలను నీకు ఇచ్చు గాక.

2. వరుడు:

నాతో ఏడడుగులు నడచి నాకు స్నేహితురలవు కమ్ము. ఏడడుగులు కూడా మనమిద్దరం నడిస్తే మనం స్నేహితులమవుతం. అప్పుడే నేను నీ స్నేహాన్ని పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎప్పుడు వియోగం పొందను. నా స్నేహన్నుంచి నీవెప్పుడు వ్యోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనసుతో ఆహారాని, బలాన్ని కలిసి పొందుతూ కలిసి ఉందాం. కలసి అలోచిన్చుకుందాం. అలాగే అన్ని నియమాలలోను బాహ్య ఇంద్రియాలు కూడా కలిసి ఉండేట్లు నడచుకుందాం.

3. వరుడు:

వెనుక స్త్రీలు అగ్ని దేవుని పూజించి కోరిన భర్తను పొందిరి. లోకోపకారి అయిన ఆ అగ్నిదేవుడు ఈ చిన్నదానికి వివాహమయిన తరువాత పుట్టింటి మీద మమకారం తగ్గించి అత్తింటి మీద విసేషానురాగం కల దానిగా చేయును గాక.....

(ఇంకా వుంది )

No comments:

Post a Comment