Monday 24 February 2014

ప్రతి హిందువు తప్పక పాటించవలసిన విధులు:

సూర్య నమస్కారములు.
విభూది లేదా కుంకుమ ధారణ.
ఇష్ట దేవతా ప్రార్ధన.
ఇంటింటా తులసి.
ప్రతి ఇంట భగవద్గిత.
దేవాలయ దర్శనం.
గోపూజ.
సమిష్టి ప్రార్థన.

ప్రతి హిందువు తప్పనిసరిగా సూర్య నమస్కారములు ప్రతి ఉదయం చేయవలెను. వీలు కాకపోతే కనీసం ప్రతి ఉదయం ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరించి " శ్రీ సవిత్రే నమః " అని 11 సార్లు స్మరించవలెను.

ప్రతి హిందువు తప్పని సరిగా నుదుటన విభూది కానీ, కుంకుమ గానీ ధరించవలెను.

ప్రతిరోజూ దైవ ప్రార్థన, శ్లోకములు , స్తోత్రములు పఠించ వలెను.

ప్రతి ఇంట తులసి చెట్టును పెంచవలెను. ప్రతి రోజు తులసికి నమస్కరించి, తులసి మొక్కకు రాగి చెంబులోని నీళ్ళు పోయవలెను.

యన్ములే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వామ్ నమామ్యహం.

అను శ్లోకమును పఠిస్తూ నిరు పోయవలెను. తులసిమొక్క మూలములో, అన్ని తీర్థ క్షేత్రాలు, మధ్యలో సర్వ దేవతలు, చివరల అన్ని వేదములు కొలువై ఉండును కనుక ఆ తులసికి నమస్కారము చేయుదును అని భావము.

శాస్త్రీయంగా కూడా తులసి నుంచి వచ్చే గాలి, అన్ని రకాల బాక్టీరియా ను నాశనం చేస్తుంది అని కనుగొన్నారు. తులసి కలిపిన నీటిలో floride శాతం బాగా తగ్గింది అని కూడా ఇటీవల కనుగొన్నారు.అందువల్ల తులసి పూజ నిమిత్తం తులసి మొక్క దగ్గర ప్రతి రోజు కొంత సేపు గడపడం ఆరోగ్యదాయకం.

ప్రతి ఇంట్లోను భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి. ఉండడం అంతే పూజ గృహం లో ఉంచడం కాదు. చదివి, అర్ధం చేసుకొని అందులో చెప్పిన విషయాలు తప్పని సరిగా పాటించడం అలవాటు చేసుకొంటే జీవితం సుఖమయం ఔతున్ది. చాలామంది భగవద్గిత పారాయణ అనగానే, మాకు యింకా అంత వయసు రాలేదు అంటారు. భగవద్గిత, రామాయణం వంటి గ్రంధాలూ చదవడానికి వయసు నిమిత్తం లేదండి. యింకా చెప్పాలంటే, చిన్న వయసులో చదివి అర్ధం చేసుకోగలిగితే, భావి జీవితం సుఖమయం ఔతున్ది. పెద్ద వయసులో ప్రశాంతంగా బ్రతకొచ్చు.

ప్రతి హిందువు ప్రతి రోజు, వీలు కాకపోతే వారానికి ఒకసారైనా, దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో దేవుడు లేదా అని కొందరు ప్రశ్నించవచ్చు కానీ, దేవాలయంలో కొన్ని శాస్త్రాల ప్రకారం దేవుని ప్రతిష్ట జరుగుతుంది. ప్రదక్షిణల వల్ల, దైవదర్శనం వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. మనసుకు శాంతి కలుగుతుంది.

హిందువులకు గోవు పరమ పూజనియమైనది. గో పోషణ చేయడం ద్వారా ఉత్తమ గతులు కలుగుతాయి.

సమిష్టి ప్రార్థనల వల్ల ఇరుగు పొరుగు తో స్నేహబంధం ఏర్పడుతుంది. సమైక్య భావం పెంపొందుతుంది. దేవాలయాల్లో భజనలు, మహిళలు పాల్గొనే లలిత సహస్ర నామ పారాయణాలు ఈ కోవకిందకే వస్తాయి.

No comments:

Post a Comment