Wednesday 5 February 2014

నిన్నటి భాగం తరువాయి:

హనుమాన్ ప్రశస్తి:

స్తాపయా మాస భూలోకే రామ భక్తిం కపీశ్వర:
స్వయం భక్తవరొ భూత్వా సీతారామ సుఖప్రద:
రుద్రావతారొ భగవాన్ భక్తోద్ధారక స్సవై
హనుమంస మహావీర్యో రామకార్య కరస్సదా
రామదూతాభిదో లోకే దైత్యఘ్నో భక్తవత్సల

(వానర శ్రేష్టుడగు హనుమంతుడు స్వయముగా భక్త శ్రేష్టుడై రామభక్తిని లోకమునందు స్థాపించెను. భక్తులను ఉద్ధరించుటకు రుద్రుడే హనుమంతుడుగా అవతరించెను. అతడు మహావీరుడు. రామ కార్ర్య దక్షుడు. రామదుతగా ప్రసిద్ధుడు. రాక్షస హంతకుడు. భక్తవత్సలుడు. )
        (శివపురాణం లోని శత రుద్రా సంహిత శ్లోకములు )

శ్రీమద్రామాయణం లో సుందరకాండము నందు హనుమంతుని తేజో బాల విభూతులు వర్ణింప బడినవి. సముద్రమును దాటు సమయమున జాంబవంతుడు హనుమను " ఓ వత్స, హనుమ, సముద్రమును దాటుట యందు నివు కూడా వాయు సమానుడవే " అని ప్రశంస నిచ్చెను.

సీతా మహాదేవియు, " ఓ కపిశ్రేష్టా! నేను నిన్ను సాధారణ వానరునిగా  తలచుట లేదు. నీకు రావణుని వలన భయము కానీ, ఆశ్చర్యము కానీ లేకపోవుట వలన నివు అసాధారణమైన వానివి అని తెలియుచున్నది. అని పలికెను.

ఇక రావణుడు హనుమను చూసి ఆశ్చర్యముతో " ఈ వానరుని తేజము ఇతర వానరముల వలె లేదు. ఆకారమున మాత్రమే ఇతడు వానరుడు. శివుని యొక్క నందీశ్వరుడే ఈ రూపమున రాలేదు కదా" అని తలపొసెను.

గాయత్రీ మంత్ర సహితమైన శ్రీమద్రామాయణ సుందరకాండము పారాయణ -- సర్వారిష్ట నివారణము, సకల సమ్పద్ప్రదము, సర్వకార్య విజయముగా పెద్దలు వచింతురు. ఆంజనేయుడు త్రిముర్త్యాత్మకుడు. మహాశక్తి సమన్వితుడు. వానినారాధించుట వలన మానవుని జీవితం సుఖమయ మగుతయె గాక మోక్ష ప్రాప్తి అనుటలో సందేహము లేదు.

No comments:

Post a Comment