Monday 24 February 2014

పూర్వపు రోజుల్లో విద్యాభ్యాసం అంటే మగపిల్లలకు గురుకులం లో జరిగేది. శిశువు పుట్టిన తర్వాత 5 సంవత్సరముల వయసు వరకు తల్లి తండ్రులతో చక్కగా గడిపి 5 సంవత్సరములకు గురువు వద్దకు వెళ్లి దాదాపు 15-20 సంవత్సరాలు విద్య నేర్చేవారు. తరువాత కాలక్రమేణ గురుకులాలు పోయి బడులు మొదలయ్యాయి. అపుడు కూడా 5 ఏళ్ళు వయసుకే బడిలో చేర్చేవారు. ఒక 20-25 ఏళ్ల క్రిందటి వరకు పిల్లలను 5 ఏళ్లకే బడిలో వేసేవారు. అప్పుడు ఎక్కువగా మాతృభాషలోనే బోధన జరిగేది. తరువాత కాలంలో ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాక kg ( అంటే కిండర్ గార్టెన్ ) చదువులు వచ్చాక 3 ఏళ్లకే LKG లో చేరిపించి 15 ఏళ్లకు 10థ్ క్లాసు ముగిసేది. మన ఆంధ్ర లో ఎక్కువగా 10+2+3 చదువు ఎక్కువ ప్రాచుర్యం లో ఉండేది. అంటే, ఒకటి నుంచి పదవ తరగతి వరకు 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, తరువాత డిగ్రీ 3 ఏళ్ళు---మళ్లీ ఇందులో 1 నుంచి 5 వరకు ప్రాధమిక విద్య, 6 నుంచి 10 వరకు ఉన్నత విద్య. తరువాత మనకు ఇష్టమైన సబ్జెక్టు తో ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా వృత్తి విద్య ( ప్రొఫెషనల్ కోర్స్) . ఇదంతా అయ్యేసరికి పిల్లవాడికి 18-20 సంవత్సరాల వయసు వచ్చేది.

అంటే ఏమిటి అన్న మాట? ఒక పిల్లవాడి మెదడు, మనసు, బుద్ది, 5 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 18-20 సంవత్సరాల వరకు వికసిస్తుంది అన్న మాట. ఫలానా ఇన్ని subjects , ఇన్ని పాఠాలు ఒక సంవత్సర కాలంలో చదివి, ఆఖరున పరీక్ష వ్రాసి తన జ్ఞానాన్ని పరిక్షిన్చుకుంటాడు ఒక విద్యార్ధి. అంటే మెల్ల మెల్లగా ఒక పిల్లవాడి సమర్ధతని బట్టి పై క్లాసులకు వరుసగా వెళ్ళేవాడు.

కానీ ఇప్పుడు ఏమి జరుగుతోంది? నర్సరీలు కూడా పోయి ప్లే స్కూల్స్ వచాయి. అంటే అమ్మఒడిలో ఉన్న పాపాయిని కూడా తీసుకెళ్ళి ప్లే స్కూల్ లో జాయిన్ చేస్తున్నారు. అదిగో అక్కడ మొదలుతోంది బాల్యం చిదిమేయడం అనే concept , తరువాత నర్సరీ. తరువాత kg చదువులు.

ఇంక 9 th వరకు వస్తే అదో కథ. 9 th పరిక్షలు వ్రాసాక వారికీ ఒక వారమే సెలవులు . మర్నాటి నుంచి 10 తరగతి కి ప్రిపేర్ చేసేస్తారు. అంటే 9 లోకి వచ్చాక వారికీ వేసవి సెలవులు ఉండవు. మండే ఎండల్లో మూలుగుతూ వెళ్ళాలి స్కూల్ కి.

ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ వాళ్ళకి 2 సంవత్సరాలు సబ్జెక్టు చదవాలి అని ఉంటె, మొదటి సంవత్సరం లోనే 2 ఏళ్ల సబ్జెక్టు పూర్తి చేసేసి, ఏడాది తర్వాత వచ్చే ఎంట్రన్స్ కి రెండవ సంవత్సరం అంతా ప్రిపేర్ చేస్తారుట. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు. పిల్లలకు అంత ఓపిక ఉంటుందా? ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉండవు. ప్రభుత్వం ban చేసిన సరే, క్లాసులు నడుస్తూనే ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ లో చేరాక దాదాపు 600 రోజులు పిల్లలు నిరంతరం చదువుతూనే ఉండాలి.

పిల్లల సంగతి సరే, వాళ్ళ భవిష్యత్ కోసం కష్టపడతారు అనుకుందాం. మరి ఇంట్లో ఉండి, వండి వార్చే తల్లుల సంగతి ఎంటండి? పిల్లలతో బాటు వాళ్ళు కూడా దాదాపు 1200 రోజులు నిరంతరం కష్టపడాలి. ( 9,10,+ 2 years ఇంటర్మీడియట్ ) సెలవులు లేకుండా. పిల్లలు 15 ఏళ్ల వాళ్ళు అయితే, తల్లులు దాదాపు 35 సంవత్సరాల వయసు దాటినా వారై ఉంటారు సహజంగా. వారికీ కూడా వేసవి సెలవులు ఉండవు. పిల్లలకు లీవ్ దొరకదు కాబట్టి వీళ్ళు కూడా ఏ పెళ్ళికి పేరంటానికి వెళ్ళడానికి ఉండదు. మరి ఏ రిక్రియేషన్ లేకుండా, పిల్లల చదువులకోసం కష్ట పడే తల్లుల ఆరోగ్యం సంగతి ఎవరైనా ఆలోచిస్తున్నార?

ఇక కార్పొరేట్ స్కూల్స్ సంగతి సరే సరి. మార్కులు తక్కువ వస్తే వెనక సెక్షన్ లో వేస్తారు అనే భయం చేత మరీ ఎక్కువగా చదివేస్తారు వీటిలో పిల్లలు. ఇంటికి ఎవరు వచ్చినా, వెళ్ళినా వీళ్ళకి తెలియనే తెలియదు. వాళ్లేమో వాళ్ళ లోకమేమో అన్నట్లు ఉంటారు. దీనివల్ల సామాజిక బంధాలు తెగిపోతున్నాయి. స్నేహితులు తప్ప బంధుగణం లో ఎవరు తెలియట్లేదు. అయినవారిని పలకరించడం కూడా చేతకావట్లేదు.

ఇవన్ని కూడా సహజంగా జరుగుతున్న పరిణామాలు కాదు. మనం గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్నాం. దీనివల్ల మన పిల్లల బాల్యం మనమే పోగోడుతున్నాం. వాళ్ళకు తెలియని tensions మనం అలవాటు చేస్తున్నాం. బంధాలు, విలువలు మనమే చేడగోడుతున్నాం. అడుకోవలసిన వయసులో వారిని బలవంతంగా చదువుకు అలవాటు చేస్తున్నాం. దీనివల్ల వాళ్లు మెరిట్ స్టూడెంట్స్ అవ్వచ్చు కానీ, మంచి పౌరులు కాలేరు. చిన్నప్పటి నుండి tensions కు అలవాటు పడ్డ ఈ పిల్లలు రేపు మంచి జీవిత భాగస్వాములు కాలేరు.

మనం ఇంత కష్ట పడుతున్నాం. కొంతమంది బలహీన మనస్కులు tensions భరించలేక చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల మనం ఏమి ఆశించి పిల్లలని అంత బలవంత పెట్టి చదివిస్తున్నామో ఆ ప్రయోజనం నెరవేరటం లేదు.

తల్లిదండ్రులారా... దయచేసి మీ పిల్లలను బాగా బలవంత పెట్టకండి. ప్రతిరోజూ వార్తల్లో ఒక స్టూడెంట్ ఆత్మహత్య అని చదువుతున్నాం. మీ పిల్లల శక్తి, ఓపిక ఎంత ఉందొ అంతే చదివించండి. వేరొకరితో పోటీకోసం పిల్లలని బలవంత పెట్టకండి. అందరికి ఇదొక్కటే నా విన్నపం.

No comments:

Post a Comment