Friday 11 September 2015

విదుర నీతి 30
పాపపుణ్యాల గురించి మన రోజూ చాలా మాటలు వింటూ ఉంటాం. మనకు నచ్చిన పనికి పుణ్యమనీ, నచ్చని పనికి పాపమనీ పేర్లు పెట్టి తృప్తిపడుతుంటాం. సత్యం, అహింస, పరోపకారం,న్యాయం, ధర్మం, ప్రేమ, ఇల్లంటివన్నీ పుణ్యకార్యాలకు ప్రేరణ గుణాలనీ, అసత్యం, అపకారం, అధర్మం, హింస ఇలాంటివన్నీ పాపకార్యాలకు ప్రేరక లక్షణాలనీ నిర్వచిస్తాం. అన్ని తెలిసీ, పాపమే చేస్తుంటాం. ప్రవచనం విన్న కాసేపు మనస్సు నిర్మలంగా ఉంతుంది. మంచినే ఆలోచిస్తుంది. పుణ్యమ చేయాలనిపిస్తుంది. ఒకసారి తెలియక పొరపాటున తప్పటడుగు వేసినప్పటికీ ఇది తప్పు అని తన అంతరాత్మతో తెలుసుకుని, భవిష్యత్తులో ఆ తప్పును మరోసారి చేయని వాడే నీతిమంతుడు. తాను చేసిన తప్పును ఇతరుల ముందు వ్యక్తీకరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనిషి పవిత్రుడవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందరో మహానుభావులు ఈ సూత్రాన్ని పాటించి పావనులై లోకానికి ఆదర్శవంతులైనారు. పదేపదే తప్పు చేస్తూ పాపకూపంలో కూరుకుపోయేవాణ్ని ఎవరూ రక్షించలేరు. తాను చేస్తున్న తప్పుల్లో పాలుపంచుకునేవారంతా "నీ పాప ఫలితాన్ని నీవే అనుభవించు" అని దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు అతని పశ్చాత్తాపానికి హద్దుండదు.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment