Friday 11 September 2015



మతం మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు రూపొందించబడిన విధానం.మనిషిలో ఉన్న దైవత్వాన్ని మరవకుండా, ఇతరులలో కూడా దైవత్వాన్ని చూడగిలిగే నైతిక ఆద్యాత్మిక విలువలను ప్రసాదించినది హిందూ ధర్మం. మతానికి సంబంధించిన అసలు అర్ధం మరచిపోయి, అది తమ సొంత ఆస్తిగా, తాము చెప్పిందే వేదంగా కొందరు ప్రవర్తించి మతానికి చెడ్డపేరు తెస్తున్నారు.
మానవత్వాన్ని మరచిపోయి, పశువాంచలు పేరుకుపోతున్నాయి. ధన, వస్తు వాహనాల వ్యామోహంలో పడి భగవంతుడిని , ఆయన చూపిన మార్గాన్ని మరచిపోయారు. సామాన్యుడిలా జీవించడంలో ఆనందముంది. కోరికల మీద నియంత్రణ ఏర్పరుచుకోవడంలో తృప్తి కలుగుతుంది. తృప్తి పొందిన ఆత్మ సక్రమమైన మార్గంలో పయనిస్తుంది. స్వచ్చమైన ఆలోచన కలిగి ఉంటుంది. అదే అసలైన మత సారాంశం.
(స్వామి శివానంద )
భగవంతుని శక్తిని గుర్తించి మోకరిల్లటం,గుర్తించక ధిక్కరించడం అనేది వారి వారి మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. తనని నమ్మని వారిని నమ్మించడం కోసం భగవంతుడు తన విశ్వరూపాన్ని వారి ముందు ప్రత్యేకంగా ప్రదర్శించటం జరగదు. ఇది భగవంతునికే కాదు, ఆయన తత్వాన్ని మన మధ్య ప్రచారం చేసే మహాపురుసులకు వర్తిస్తుంది.
శంకరాచార్య, రామానుజాచార్యుల మొదలుకొని ఏ తత్వభోధకుడు తన గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేయలేదు. వారిలోని విజ్ఞానాన్ని, వారు వెతికిన కొత్త మార్గాన్ని ఇతరులు గమనించి వారిని మహాత్ములుగా పూజించారు. అదే విధంగా భఘవత్ బోధన చేస్తున్నవారు నేటి సమాజంలో కూడా ఉన్నారు. వారిని గుర్తించి, ఆదరించాల్సిన బాద్యత సమాజానిది. మనం గుర్తించినంత మాత్రాన నిజానికి వారికి పొయేదేం లేదు. వారి బోధనలు వినలేకపోవటం ద్వారా మనమే దురదృష్టవంతులుగా మిగిలిపోతాం.

No comments:

Post a Comment