Friday 11 September 2015



క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్చాంతిం నిగచ్చతి:
కౌతేయ!ప్రతిజానీహి
న మే భక్త ప్రణశ్యతి||
"నన్నాశయించినవాడు శీఘ్రంగా ధర్మబుధ్ధి గలవాడవుతున్నాడు. శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఓ అర్జునా! న భక్తుడు ఎన్నటికీ చెడడు" అని శ్రికృష్ణుని అభయవచనం.


శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళీన తర్వాత యశోద రాధ దగ్గరకు వెళ్ళీంది. రాధ ధ్యానమగ్నయై ఉంది. నేను ఆద్యాశక్తిని. ఏదైనా వరం కోరుకో అంది రాధ. " మనోవాక్కాయ కర్మలచే శ్రీకృష్ణునే సేవించునట్లు అనుగ్రహించు, ఈ కళ్ళతో కృష్ణ్ భక్తులను దర్సించునట్లు , మనస్సుతో అతనిని మాత్రం ధ్యానించునట్లు, ఈ లానుక ఎల్లప్పుడూ అతని నామగుణకీర్తన చేయునట్లు" వరము ఇమ్మంది యశోద.
ఇంతకన్నా మానవమాత్రులమైన మనకు మాత్రం వేరే ఏమి కోరికలు ఉంటాయి? యశోద మనకు అందరికీ చక్కని మార్గం చూపింది.


సత్పురుషుల సహవాసం జనులకు సత్యవాక్కులను నేర్పుతుంది. బుధ్ధిమాంద్యమును తొలగిస్తుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపములను నశింపచేస్తుంది. కీర్తిని పెంచుతుంది. బుధ్ధిని వికసింపచేస్తుంది. సత్సంగము సకల కార్యాలను సాధిస్తుంది.
****మహమ్మద్, క్రీస్తు, బుద్ధుడు, అందరూ మంచివాళ్ళే.. అయితే నీకేమిటి ప్రయోజనం? నీవు మంచివాడివి కానప్పుడు నిన్నెవ్వరూ రక్షించలేరు.
****సాధారణ వ్యక్తి తొంభై శాతం శక్తియుక్తులను వృధా చేసుకొంటాడు. మనసుపై అదుపు సాధించినవాడు తప్పుచేయడు. విజేతకు, పరాజితునికి ఉన్న ముఖ్య బేధం ఇదొక్కటే.

No comments:

Post a Comment