Friday 4 September 2015

జీవితాన్ని సరిదిద్దుకునేందుకు తగిన మార్గాన్ని చూపించేదే "ధర్మం." మనిషి ధర్మబధ్ధంగా ఎలా జీవించాలో చూపేందుకే భగవంతుడు, రాముని రూపంలో మానవునిగా అవతరించాడు. తండ్రిపట్ల కుమారుల కర్తవ్యం, సోదరుల పట్ల అగ్రజుని ప్రేమాతిశయాలు, భార్య పట్ల ఒక భర్త వ్యవహరించవలసిన తీరు, అన్నిటినీ మించి, ఒక ప్రభువు ప్రజలను పాలించవలసిన పధ్ధతినీ, అంతేకాక, బలవంతుడైన, గుణవంతుడైన ఒక శత్రువుతో ఎలా మెలగాలో కూడా శ్రీరాముడు ఆచరించి చూపాడు. కనుకనే రామాయణం--రాముడు నడచిన మార్గం మనకు మార్గదర్శకమైంది. ఎన్ని శతాబ్దాలు గడిచినా మాయని, మరపురాని ధర్మసూక్ష్మాలను రాముడు మనకోసం వదిలివెళ్ళాడు. ఆ మాటలతో తరించి, ఆ బాటలో నడిచి, మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం...
జై శ్రీ రాం.

No comments:

Post a Comment