Monday 14 September 2015

విదురనీతి 40
మన ప్రతి ఆలోచనా, ప్రతి చర్యా స్వార్ధంతో కూడుకున్నది. "నేను", మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టే హింస లేకుండా జీవించలేకపోతున్నాం. స్వార్ధరహితంగా ఆలోచించినప్పుడే హింసలేకుండా చేసుకోగలం.
స్వార్ధం ఉండడం మంచిదే కాని అది పరిమితి మించకూడదు. పరిమితి మించిన స్వార్ధం హిన్సకు దారితీస్తుంది. స్వార్ధం లేకపోతే జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.
దయ అంటే శత్రువునైనా ఆపదలఒ ఉంటే కాపాడటం, క్షాంతి: అంటే ఎవడైనా తనకు దు:ఖం కలిగిస్తే, మనసులో గాని, బయటగాని వాడిపై కోపం లేకుండా ఉండటం.
గుణవంతుల గుణాలను వెల్లడి చేయకుండా ఉండాటం అసూయ. శౌచం అంటే పతితుల సొమ్మును గ్రహించకుండా ఉండటం, తిన తగని పదార్ధాలను తినకుండా ఉండటం.
శరీరాన్ని అలసటకు గురిచేసే తప్పుడు పనులకు దూరంగా ఉండటం, అనాయాసమైఅతే, నింధించబడే పనులను విడచి ప్రశస్తమైన పనులు చెయ్యటం మంగళదాయకం.
మనలో చాలామంది ఎవరికి వాళ్ళమే అధికులమనే అహంకారంతో ఉంటారు. ఈ అహంకారం వలన ఏ కార్యమూ సానుకూలంగా జరగదు. కార్యం సానుకూలమవ్వాలంటే ప్రతివ్యక్తీ ముఖ్యంగా వినయం, విధేయత అలవరచుకోవాలి.
(ఇంకా ఉంది )

No comments:

Post a Comment