Friday 11 September 2015

విదుర నీతిలో వక్త విదురుడు. శ్రోతకంటే వయస్సులో చిన్నవాడు. అయినా జ్ఞానసంపదలో ఉంపదేశ సామార్థ్యంలో మిన్న. లోకతత్వం, లోకెశ్వర తత్వం తెలిసినవాడు. దాదాపు ఆరువందల శ్లోఅకాలతో ఒక మహానీతి శాస్త్రంగా రూపొంది మానవజాతికి శాశ్వతంగా ఒక మణిహారంగా అలరారుతున్నది ఈ విదురనీతి. మహాభారతం లోని ముఖ్యులు కౌరవులు, పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు, పాండవుల వనల తన కుమారులకు ఎటువంటి ముప్పు కలుగుతుందోనని భయపడుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు. అటువంటి భయస్థుడైన ధృతరాష్ట్రుడు మంచ్ హితవు చెప్పమని తన కొలువులోని విదురుణ్ణి కోరతాడు. ఆ సమయంలో విదురుడు ఎన్నో మంచి మాటలు చెబుతాడు. మంచి నీతులు కలిగి ఉన్నది కాబట్టి "విదుర నీతి"కి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది.
ఇటువంటి విదుర నీతి కావ్యాన్ని మన అందరి సౌకర్యార్ధం శ్రీ ఓరుగంటి శివరామకృష్ణ ప్రసాద్ గారు తేట తెలుగులో వచనంలో వ్రాసారు. వారికి ధన్యవాదములు, నమోవాకములు తెలుపుకుంటూ ఈ రచనను చిన్ని చిన్ని భాగాలుగా మన పజీ లో ప్రతిరోజూ పొందుపరుస్తాము. మిత్రులు గమనించ ప్రార్ధన...

No comments:

Post a Comment